మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. వీఆర్ఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్ వద్దకు చేరుకొని ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వీఆర్ఏలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు, వీఆర్ఏలను మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు వెళ్లనివ్వకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కు దిగారు. దీంతో మినిస్టర్ క్వార్టర్స్ మెయిన్ రోడ్డు లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.