మూడేళ్ల బాలికపై అత్యాచారం..

punam-26.jpg

ఏపీలో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై సంచలన ట్వీట్ చేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. క్రిమినల్‌కు శిక్ష పడే వరకు వాయిస్ రేజ్ చేయాలని కోరింది. మెయిన్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయలేదని పొలిటికల్ లీడర్స్‌ మీద నమ్మకం లేదన్న ఆమె మనం వినిపించే నిరసన గళంతో ఇలాంటి యానిమల్స్ చేతిలో మరొకరు బాధితులుగా మారకుండా ఉంటారని సూచించింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. పొలిటికల్ బెనిఫిట్ ఉందనుకుంటేనే మీడియా ఇలాంటి వార్తలకు ప్రాధాన్యతనిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాగా ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న జనాలు ఈ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్‌పై స్టాండ్ తీసుకున్నందుకు హీరోయిన్‌కు థాంక్స్ చెప్తున్నారు. ఆమెలాగే మరింత మంది సెలబ్రిటీలు తమ వాయిస్ వినిపించాలని కోరుతున్నారు. అప్పుడే మన పిల్లలు సురక్షితంగా ఉండగలరని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని అడుగుతున్న నెటిజన్లు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ ఘటనపై విమర్శించేందుకు ఇప్పటికి చాలా సార్లు మీడియా ముందుకు వచ్చేవాడని అంటున్నారు.

Share this post

scroll to top