నేడు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు..

havey-rain-13.jpg

నేడు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఏపీలోని అల్లూరి, మన్యం, ఎన్టీఆర్, కాకినాడ, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు నుంచి మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈరోజు నుంచి రాబోయే ఐదు రోజులపాటు వర్ష సూచనలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Share this post

scroll to top