స్పిరిట్ మూవీకి ముందుగా దీపికా పదుకొణె హీరోయిన్ అనుకున్నారు. కానీ చివరకు ఆమె స్థానంలోకి త్రిప్తి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్పిరిట్ ఆఫర్ రావడంతో త్రిప్తి డిమ్రీ రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. గతంలో ఒక్కో సినిమాకు రూ.40 లక్షలు పారితోషికం తీసుకుంది త్రిప్తి. కానీ యానిమల్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో వరుస ఆఫర్స్ రావడంతో నెమ్మదిగా రెమ్యునరేషన్ పెంచేసింది. అయితే ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం త్రిప్తి రూ. 5 కోట్లు తీసుకుంటుందని టాక్. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. హై యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.