సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ రీ-రిలీజ్ సందర్భంగా విజయవాడలో ఓ థియేటర్లో భయానకర సంఘటన చోటుచేసుకుంది. ఈ రిలీజ్ సందర్బంగా అభిమానుల ఉత్సాహం అందరినీ అలరించినప్పటికీ, ఓ అభిమాని చేసిన అనూహ్య చర్య మాత్రం థియేటర్ లో కలకలం సృష్టించింది. ‘ఖలేజా’లో మహేష్ బాబు ఎంట్రీ సీన్ ఓ పాముతో నడిచే గెటప్లో ఉండగా, అదే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయాలని విజయవాడలోని బెజవాడ థియేటర్కు ఓ అభిమాని నిజమైన పాముతో వచ్చాడు. మొదట అది రబ్బర్ పామని భావించిన అభిమానులు, పాము కదులుతూ ఉండటంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
థియేటర్లోకి పామును తీసుకొచ్చిన మహేశ్ అభిమాని..
