ఇటీవల పోలీసుల దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడ్డ వైయస్ఆర్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు పరామర్శించారు. వైయస్ఆర్సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పాలన వదిలేసి వైయస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని నారాయణరెడ్డిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.
నారాయణరెడ్డి కుటుంబానికి వైయస్ఆర్సీపీ ఆర్థిక సాయం..
