నేడు హోలీ పండుగ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలను జరుపుకుంటున్నారు. అయితే, హోలీ పండుగ దక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారత ప్రజలు ఘనంగా జరుపుకుంటుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్న పెద్దా కలిసి రంగులను పూసుకుని పండుగను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ హోలీ మీ అందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. హోలీ పర్వదినం సందర్భంగా ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోస్టు చేశారు.
హోలీ సరికొత్త సంతోషాలు నింపాలి..
