మ‌రోసారి ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు..

ktr-06.jpg

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మ‌రోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. విచార‌ణ‌కు రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ నోటీసులు ఇవ్వాల‌ని ఏసీబీ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. నోటీసులు ఇచ్చి విచారించాల‌ని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. న్యాయ‌వాది స‌మ‌క్షంలో విచార‌ణ చేయాల‌ని కేటీఆర్ కోరుతున్నారు. ఇప్ప‌టికే కేటీఆర్ క్వాష్ పిటిష‌న్ తీర్పును హైకోర్టు రిజ‌ర్వ్ చేసింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమకేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీలు జారీచేశారు. ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నందినగర్‌లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్‌ కారును పోలీసులు అడ్డుకున్నారు.

Share this post

scroll to top