నితీశ్‌కు 25 లక్షల చెక్ అందజేసిన సీఎం చంద్రబాబు..

nithish-17.jpg

ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకు మించి రాణించిన ఆంధ్రా కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశాడు. గురువారం జనవరి 17 తన తండ్రి ముత్యాల రెడ్డితో కలిసి ఉండవల్లికి వచ్చిన నితీశ్ చంద్రబాబు నాయుడును కలిశాడు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గతంలో ప్రకటించిన రూ. 25 లక్షల చెక్ ను చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నాడు నితీశ్. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ కొట్టినందుకు ఏసీఏ ఈ నజరనా ప్రకటించింది. గురువారం ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆ నజరానా చెక్ ను నితీశ్ కుమార్ రెడ్డికి అందించారు. టీమిండియా క్రికెటర్ తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో ఈ తెలుగు క్రికెటర్ మరిన్ని సెంచరీలు కొట్టాలని ఆకాంక్షించారు.

Share this post

scroll to top