2014 నుంచి 2019 వరకు ఏపీలో విధ్వంసం ..

amith-sha-20.jpg

అపార సహజ వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 వరకు విధ్వంసం సృష్టించారు. అది మానవ తప్పిదాలతో సృష్టించిన విధ్వంసం. దాంతో ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అభివృద్ధి పూర్తిగా అడుగంటింది’ అని కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో చంద్ర­బాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

గన్నవరం మండలం కొండపావులూరులోని ఆదివారం నిర్వహించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి మూడు రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కాగా, అమిత్ షా హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం చంద్రబాబు పట్ల స్వామిభక్తి ప్రదర్శించారు. అమిత్ షా ప్రసంగాన్ని తెలుగులోకి అనువదిస్తూ ‘2019 నుంచి ఐదేళ్లపాటు రాష్ట్రంలో జరిగిన విధ్వంసం’ అని మార్చి చెప్పారు.

Share this post

scroll to top