చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్..

pedhi-reddy-30.jpg

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని నిత్యం తమపై బుదరచల్లే కార్యక్రమం చేస్తోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండపడ్డారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పులిచర్ల మండలంలో అటవీభూములను కబ్జా చేశామంటూ చంద్రబాబుకు అంటకాగే ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని ఖండించారు. ఇటువంటి తప్పడు కథనం ప్రచురించిన ఈనాడు సంస్థలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  ఒక్క ఎకరం అయినా చట్ట విరుద్దంగా కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని సవాల్ చేశారు. చట్టబద్దంగా 2001లో కొనుగోలు చేసిన భూములపై నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలతో కూడిన కథనంను ప్రచురించడం వెనుక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు.  

Share this post

scroll to top