ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులు..

sandeep-reddy-11.jpg

ప్రస్తుతం మన దేశంలో అత్యుత్తమ ఆధునిక సినిమాలను తెరకెక్కిస్తోన్న దర్శకనిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్… వాస్తవ సంఘటనలను సినిమా రూపంలో అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హావా మరింత పెరిగింది. ముఖ్యంగా వరల్డ్ దృష్టిని ఆకర్షించే చిత్రాలను తెరకెక్కించడంలో మన దర్శకులు ముందుంటున్నారు. హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్న సౌత్ డైరెక్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా గౌరవాన్ని నిలబెట్టాడు డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా, అట్లీ సైతం వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు. వీరిలో అట్లీ ఒకరు. ఇప్పటివరకు చేసింది ఆరు సినిమాలే అయినప్పటికీ 100 శాతం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.

రాజా రాణి సినిమా నుంచి మెర్సల్, బిగిల్, జవాన్ చిత్రాల వరకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని దృఢంగా సుస్థిరం చేసుకున్నాడు. 2023లో విడుదలైన జవాన్ అతడి కెరీర్‏లో ఒక మలుపు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. జవాన్ సినిమా తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన అట్లీ. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. AA22 X A6 పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతోపాటు అట్లీ పారితోషికం కూడా పెరిగిందని అంటున్నారు. జవాన్ సినిమాకు రూ.30 కోట్లు పారితోషికం తీసుకున్న అట్లీ. ఇప్పుడు AA22 X A6కు రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. ప్రస్తుతం ఈ విషయం 2025 నాటికి భారతదేశంలో అత్యధికంగా చెల్లించే డైరెక్టర్లలో మూడవ స్థానంలో నిలిచింది.

Share this post

scroll to top