ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు రూ.6.60 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలు పెన్నా సిమెంట్స్ అధినేత పి.ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ప్రత్యేక పూజలు జరిపి వేద ఆశ్వీరచనం ఇచ్చారు. నూతనంగా 7 కేజీల బంగారంతో తయారు చేసిన 3 స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామలరావుకి దాత అందించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి, కిరీటాలను సీతారామ లక్ష్మణులకు అలంకరించారు.
శ్రీ సీతారామ లక్ష్మణులకు 3 స్వర్ణ కిరీటాలు..
