జవాన్‌ వీర మరణంపై వైయ‌స్ఆర్‌సీపీ సంతాపం..

ys-j-10-1.jpg

భారత్-పాకిస్తాన్ యుద్దంలో అమరుడైన మురళీనాయక్‌కు తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. జమ్మూకశ్మీర్‌లో వీరమరణం చెందిన జవాన్‌ మురళీనాయక్‌ కుటుంబాన్ని మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. యుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్‌ మురళీ నాయక్‌ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో తెలుగు జవాన్‌ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి పిన్న వయసులోనే అశువులు బాయడం బాధాకరం అన్నారు. 

Share this post

scroll to top