కేసులును నేను వెనకేసుకురావడం లేదు..

ys-ja-03.jpg

కేసులును నేను వెనకేసుకురావడం లేదు. కానీ, మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని పోలీసులు, ప్రభుత్వానికి సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. గుంటూరు జిల్లా తెలానిలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్‌ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కోర్టులో హాజరుపర్చే ముందు హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. గాయాలు చూపిస్తే డాక్టర్లు నోట్ చెయ్యలేదు? అని ప్రశ్నించారు. మెడికో లీగల్ కేసు అవుతుందని ఇలా చేశారా? పోలీసులు డాక్టర్ ను బెదిరించి ఉండాలి. ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే మంచివారైన పోలీసులు ఈ వీడియో రిలీజ్ చేశారు. చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే పోలీసులు చేసిన పనిని‌ సమర్దించుకునేందుకు వీరిపై సంఘవిద్రోహులుగా ప్రచారం చేశారు. జరిగిన ఘటన దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.

Share this post

scroll to top