మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్..

drenking-28.jpg

భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫుల్‌గా మద్యం తాగి రహదారికి అడ్డంగా యువ‌తి పడుకుంది. భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది. అయితే భీమవరంలో మద్యం మత్తుతో యువతి హల్చల్ చేయడంపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతోందని ఈ నేపథ్యంలో మహిళలు కూడా విచ్చలవిడిగా మందు తాగి రోడ్లపై రచ్చ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇకపై దీనిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు.

Share this post

scroll to top