2014 – 19 మధ్య కాలంలో జరిగిన తుని రైలు దగ్ధం కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాధం సహా మరో 40 మందిపై అప్పట్లో కేసు నమోదైందని ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవటంతో కోర్టు కొట్టివేసిందని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. అప్పటి ఘటనపై తాజాగా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలనుకుందని చెప్పారు. సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం? అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లోకి చేరుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు. ఇప్పుడు ఈ అంశంపై పట్టించుకోవడం లేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలను ముద్రగడ పద్మనాభం నిరసనలకు ఆందోళన చేపట్టారని తునిలో భారీ బహిరంగ సభ జరిగిందన్నారు. సభ తర్వాత రైల్వే ట్రాక్ పై రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగులబడిందని వెల్లడించారు. రైలును కాపులే తగులబెట్టారని అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
కాపులు అంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం..
