రేపు గుంటూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌..

ys-jagan-10.jpg

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్‌ జైల్‌ కు చేరుకుంటారు, అక్కడ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ను పరామర్శించిన అనంతరం, అక్కడినుంచి బయలుదేరి ఎస్‌ వీఎన్‌ కాలనీలో క్రోసూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళతారు, ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈద సాంబిరెడ్డిని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Share this post

scroll to top