వర్షాలే వర్షాలు..

rain-30.jpg

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజుల నుంచి ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు మరింతగా బలపడింది. దీంతో బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఈ క్రమంలో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Share this post

scroll to top