టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్… కేంద్ర సహాయమంత్రులు అనుప్రియ పాటిల్, జయంత్ చౌదరి, రాందాస్ అథవాలే, ఎంపీ ప్రపుల్ పటేల్ హాజరుకానున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.