ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్న ఆయన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం టీడీపీ మంత్రులతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. నామినేటెడ్ పదవులు. టీడీపీ సభ్యత్వానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక, ఎంపీలు, జోనల్ ఇంఛార్జీలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కొన్ని శాఖలకు సంబంధించి ఎంపీలు దృష్టి పెట్టాలని ఇప్పటికే సూచించారు సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దిశగా ఇవాళ సమావేశంలో కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లే విధంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
నేడు మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు భేటీ..
