తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, సాంఘీక చైతన్య ఉద్యమ దీపిక సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. బుధవారం సురవరం ప్రతాపరెడ్డి జంయతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆంధ్రుల సాంఘీక చరిత్రకు జీవం పోసిన మహానీయుడని కొనియాడారు. గోలకొండ పత్రిక ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రగిలించిన స్వాతంత్య్రోద్యమ యోధుడు, తొలి తెలంగాణ వైతాళికుడైన సురవరం సేవలు మరువలేనివని స్మరించుకున్నారు. కాగా ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు యూనివర్సిటీకీ సురవరం పేరును మార్చుతూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బిల్లును ఆమోదించింది.
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి..
