అల్పపీడనం ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈనెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడంతో తీర ప్రాంతాల అధికారులు అలర్టయ్యారు.
ఇదిలాఉంటే తమిళనాడుకు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే 48 గంటలు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం 19 జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు1 కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.