టాలీవుడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి,లెజండ్ డైరెక్టర్ మణిరత్నం కంబోలు మూవీ తెనరెక్కబోతున్నట్లుగా సౌత్లో కొద్దిరోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ అయింది. కథానాయికగా కన్నడ భామ లేటెస్ట్ సెన్షేషన్ రుక్మిణీ వసంత్ ను సెలక్ట్ చేసినట్లు సుమారు 30 సంవత్సరాల తర్వాత మణిరత్నం తెలుగు సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వరుస అప్ డేట్లు వినపడుతున్నాయి. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా ఈ విషయంపై మణిరత్నం స్పందించారు.
ఇటీవలే కమల్ హసన్తో 35 యేండ్ల తర్వాత జట్టు కట్టి ‘థగ్ లైఫ్’ సినిమాను రూపొందించిన మణిరత్నం ఇప్పుడు ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మణిరత్నం ‘వారు ఏమి మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ. నేను రెండు స్క్రిప్ట్ల పై పని చేస్తున్నాను, ఏది కార్యరూపం దాలుస్తుందో చెప్పలేను’ అని అన్నారు. కానీ ఆయన సమాధానం అవును అని చెప్పలేదు కాదు అని కూడా చెప్పలేదు. అంటే ఆ రెండు స్క్రిప్ట్లలో నవిన్ తో మూవీ కూడా ఉండి ఉండవచ్చు.