ఇది ప్రజాస్వామ్యమా.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగమా..

rk-roja-17.jpg

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మ‌హిళ‌ను చెట్టుకు క‌ట్టేసి కొట్టారంటే  ఇది ప్రజాస్వామ్యమా లేక రెడ్‌ బుక్‌ రాజ్యాంగమా అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. , ఏ రాష్ట్రంలోనైనా ఇలా జరుగుతుందా, ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం ఎక్కడైనా చూశామా అని ప్ర‌శ్నించారు. టీడీపీ నాయకుడే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత దారుణమ‌న్నారు.  కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త ఘటనను మాజీ మంత్రి ఆర్‌ కే రోజా తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు.

అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి చంద్రబాబు అంటారు. ఎవరైనా అడపిల్లల జోలికి వస్తే అదే వాళ్లకు చివరి రోజు అవుతుందని అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యను చెట్టుకు కట్టేసి కొడుతుంటే మీరు ఏం చర్యలు చేపట్టారు. వీళ్లకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన టీడీపీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? అతనికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది. కొడుకు ముందు అమ్మను కట్టేసి కొట్టారంటే ఈ రోజు పోలీసులను చూసినా భయం లేదు. చంద్రబాబును, హోం మంత్రిని చూసినా మీ పార్టీ వాళ్లకు భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్‌ చెప్పినట్లు ఎవరు ఎక్కువగా హింస చేస్తే, ఎవరు ఎక్కువ దాడులు చేస్తే మీ గుడ్‌లుక్స్‌లో ఉండొచ్చు అన్నట్లుగా రాష్ట్రవ్యాప్తంగా అరాచకం సృష్టిస్తున్నారు.

Share this post

scroll to top