వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలని ఎమ్మెల్యే అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే బీఆర్ఎస్ ది కాదని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏసీలో చర్చ జరగకుండా అసెంబ్లీలో ఎజెండా ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. టూరిజం మీద చర్చ కాదు లగచర్ల బాధితుల మీద చర్చ పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి కి ఓటు వేసినందుకు లగచర్ల వాసులకు బేడిలు వేశారని మండిపడ్డారు. వాళ్ళు ఏమి తప్పు చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు, అదానీ కోసం భూములు గుంజుకుంటున్నారన్నారు. హరి నాయక్ కు గుండె పోటు వస్తే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు.