బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ కోస్తాంధ్రకు, ఉత్తర తమిళనాడు మధ్య ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, బాటప్ల ప్రకారం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. లోతట్టు ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి భారీ హెచ్చరిక..
