రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం, విశ్వాసానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధిలో పార్టీకి విడదీయరాని అనుబంధం ఉంది. తొలిసారి మన కడపలో ఘనంగా జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ భూస్థాపితం అయిపోయిన పార్టీ అని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. మద్యం, ఇసుక, మైనింగ్ కుంభకోణాలతో మాజీ సీఎం జగన్ అండ్ కో టీమ్ ప్రజా సంపద దోచుకుంది అని విమర్శించారు. ఈ తరుణంలో వస్తున్నా మీ కోసం అని నాడు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఎప్పుడైన సీఎం చంద్రబాబు ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. యువగళం పేరుతో తెలుగు ప్రజలకు నారా లోకేష్ అండగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు.
వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు..
