తనకు సొంత ఎజెండా అంటూ ఏమిలేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయొద్దనేది తన వాదన అని కవిత అన్నారు. మంచిర్యాలలో ఆమె చిట్చాట్ గా మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తను జైల్లో ఉన్న సమయంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను కలుపుతామని చెప్పారని కవిత అన్నారు. కాగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని తను ఒప్పుకోనని కవిత స్పష్టం చేశారు.
తను తన తండ్రి కేసీఆర్ను కలవాలని, ఆయనకు ఈ విషయాలు చెప్పాలని ప్రయత్నం చేశానన్న కవిత తండ్రిని కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయానన్నారు. ఇక పార్టీ విషయాలను తన తండ్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ వివరించడంలో తప్పులేదని మరోసారి స్పష్టం చేశారు. అలాంటిది తన లేటర్ బయటకు తెచ్చినవారిని పట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్కు ఇటీవల రాసిన లేఖ సంచలనంగా మారింది. లేఖను బయటకు తెచ్చిందేవరో చెప్పాలంటూ ఆమె పార్టీ నాయకులను డిమాండ్ చేశారు. మరోవైపు పార్టీని బీజేపీలో కలపడానికి ప్రయత్నాలు జరిగాయన్న ఆమె దానికి ఒప్పుకోనని స్పష్టం చేశారు. అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారని కవిత ప్రశ్నించారు.