తమన్నాను రీసెంట్ గా మైసూర్ శాండల్ సోప్ తో డీల్ చేసుకుంది. కర్ణాటక ప్రభుత్వం తమన్నాను మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాను ఎంపిక చేసింది. అయితే ఈ డీల్ ఇప్పుడు తమన్నాను చిక్కుల్లో పడేసింది. కర్ణాటక బ్రాండ్గా ఉన్న మైసూర్ శాండల్ కు తమన్నాను ఎందుకు ఎంపిక చేశారు అంటూ కన్నడిగులు ప్రశ్నిస్తున్నారు.
మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ కు తమన్నాను నియమించడం పై వస్తున్న విమర్శల పై కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ రియాక్ట్ అయ్యారు. పాన్-ఇండియా సెలబ్రిటీ అయితే మైసూర్ శాండల్ సోప్ విస్తరణను భారీగా పెంచొచ్చు అని అన్నారు. ఇక ఈ డీల్ కోసం తమన్నా ఏకంగా రూ. 6.2 కోట్లు అందుకుంటుందని తెలుస్తుంది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న మైసూరు శాండల్ సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులకు తమన్నా బ్రాండ్ అంబాసిడర్గా అధికారికంగా నియమించారు. కన్నడలో స్టార్స్ ఉండగా తమన్నా ఎందుకు అంటూ కన్నడిగులు సీరియస్ అవుతున్నారు.