అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరించాలని సూచించారు. మూడు పార్టీలు ఉన్న కూటమిలో చిన్న చిన్న పొరపొచ్చాలు సహజం అన్నారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు ఎందుకా ఏడుపు రెడ్బుక్అంటే ఒకరికి గుండెపోటు వచ్చింది. ఒకరు బాత్రూమ్లో కాలు జారి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. అర్ధమైందా రాజా అని లోకేశ్పేర్కొన్నారు. తాము రూపొందించిన ఆరు శాసనాలు అమలు చేసేందుకు అహర్నిశలు కృష్టి చేస్తామని అన్నారు. ఎప్పుడూ మా ఇంటి తలుపు మీ కోసం తెరిచి ఉంటాయన్నారు. రాజమండ్రి జైలులో ఆయనను చూసి చాలా బాధ వేసిందన్నారు. ఆ పరీక్షను ఎదుర్కొని తిరిగి గెలిచారని అన్నారు.
ఇది టీడీపీ కార్యకర్తల నాటు దెబ్బ..
