అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు. గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం చేపట్టిన అడవి తల్లి బాట కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడతారు. ఉదయం 11 గం.కి దుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామ సందర్శన. పివిటీజీ ప్రాంతాలను కలిపే రోడ్లకు శంకుస్థాపన. అనంతరం దుంబ్రిగూడ ఆశ్రమ పాఠశాలలో బహిరంగ సభ ఉంటుంది.
అల్లూరి జిల్లా పర్యటనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్..
