నిర్మాతకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వనున్న పవర్ స్టార్..

pavan-04.jpg

హరిహరవీరమల్లు సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించారు. ఆతర్వాత దర్శకుడు మారాడు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. హరిహరవీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకొని పవన్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారని తెలుస్తుంది.

హరిహరవీరమల్లు సినిమా కోసం పవన్ రూ. 11కోట్లవరకు అడ్వాన్స్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని మొత్తం రూ. 11కోట్లు తిరిగి ఇవ్వనున్నారని తెలుస్తుంది. అంతే కాదు సినిమా పై  ఎక్కువ ఒత్తిడి లేకుండా రిలీజ్ చేయమని రత్నంకు చెప్పారట పవన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ పై అభిమానులు, నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ ఓజీ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Share this post

scroll to top