నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది, ఆంధ్రప్రదేశ్కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది. ఇక, గడచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా డెంకాడలో 2 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. తీవ్ర అల్పపీడనంపై విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ పూర్తి వివరాలను వెల్లడించారు. ఇక, పంటలు కోసే సమయం కావడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..
