ప్రతీక్ జోషి, అతని భార్య కోమి వ్యాస్, వారి కవల కుమారులు ప్రద్యుత్, నకుల్, పెద్ద కుమార్తె మిరాయగా గుర్తించారు. ప్రమాదానికి ముందు ప్రతీక్ జోషి కుటుంబం విమానంలో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో ఆనందంగా కుంటుంబంతో లండన్ వెళ్తున్న ప్రతీక్ జోషి అక్కడే ఫ్యామిలీతో ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇక భార్య కోమి వ్యాస్ తన డాక్టర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుని పిల్లలు, భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోటి ఆశలతో కుటుంబంతో లండన్ బయల్దేరింది. కాని తానొకటి తలిస్తే దైవం మరోకటి తలచినట్లు విమాన ప్రమాదం మొత్తం కుటుంబాన్న బలి తీసుకుంది. ఈ హృదయ విదాకర ఘటన ప్రతి ఒక్కరినీ కంటనీరు పెట్టిస్తుంది.
విమాన ప్రమాద మృతుల్లో రాజస్తాన్ కు చెందిన వారు మొత్తం10 మంది ఉన్నారు. వారిలో ఐదుగురు ప్రతీక్ జోషి కుటుంబానికి చెందిన వారే కావడం బాధాకరం. ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్లో ఉంటున్నారు. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆయన ఇండియాలోని భార్య, పిల్లలను లండన్ తీసుకెళ్లి అక్కడ స్థిరపడాలని కలలు కన్నాడు. కానీ ఊహించని ప్రమాదంతో ఆ కుటుంబం ఆశలన్నీ కరిగిపోయాయి. వారి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఐదేళ్ల కవలలు. పెద్ద కుమార్తె మిరాయకు తొమ్మిదేళ్లు.