Tag Archives: bjp

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల రద్దుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పై దుష్ర్పచారం చేసి ఎలాగైనా గెలవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనపై గురువారం గాంధీభవన్ లో చార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…మోదీ సర్కార్ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయి పనిచేస్తుందన్నారు. గత ప్రధానులందరూ కలిసి రూ.54 లక్షల కోట్ల అప్పులు చేస్తే ప్రధాని ...

Read More »

మూడోసారి గెలిస్తే UCC అమలు చేసి తీరుతాం:
అమిత్ షా

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసి తీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ‘మన దేశం షరియా చట్టాలు, వ్యక్తిగత చట్టాలపై నడవాలా? ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ వ్యక్తిగత చట్టాలకు చోటు లేదు. మరి భారత్లో ఎందుకున్నట్టు? పలు ముస్లిం దేశాలే షరియా చట్టానికి దూరంగా ఉంటున్నాయి. మనమూ ముందడుగు వేయాలి’ అని తెలిపారు.

Read More »

తొలి దశ పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా ఏప్రిల్ 19న (శుక్రవారం) తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదని ఈ లేఖ ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పదలచుకున్నాను. దేశంలోని కుటుంబాలు, ముఖ్యంగా వృద్ధులకు గత 5-6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు గుర్తుండే ఉంటాయి. అయితే గత 10 పదేళ్ల ఎన్డీయే పాలనలో సమాజంలోని అన్ని వర్గాల జీవన నాణ్యత మెరుగైంది. సమస్యలు చాలా ...

Read More »

ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే, గుంటూరు టికెట్ ఆశించిన ఆయనకు పార్టీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర గుంటూరు జిల్లా పల్నాడులో కొనసాగుతోంది. ఇవాళ్టి సిద్ధం ...

Read More »

రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల!

లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను BJP రేపు విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘సంకల్ప్ పాత్ర’ పేరిట ‘మోదీ గ్యారంటీ అభివృద్ధి చెందిన భారత్ 2047’ అనే థీమ్తో మేనిఫెస్టోను రూపొందించారట. ఇందులో దేశాభివృద్ధి, పేదలు, యువత, రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు సమాచారం. మేనిఫెస్టోకు ప్రజల నుంచి సజెషన్స్ స్వీకరించగా, 1.5M సూచనలు వచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Read More »

సుభాష్ చంద్రబోస్ ప్రధాని అంటున్నారు:KTR

లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న BJP అభ్యర్థులపై మాజీ మంత్రి KTR ట్విటర్ వేదికగా విమర్శలకు దిగారు. ‘సుభాష్ చంద్రబోస్ మన మొదటి ప్రధాని అని ఉత్తరాదికి చెందిన ఒక BJP అభ్యర్థి చెప్పారు. దక్షిణాదికి చెందిన మరో BJP నాయకుడు మహాత్మా గాంధీ మన ప్రధాని అని చెప్పారు. వీళ్లంతా ఎక్కడి నుంచి పట్టభద్రులయ్యారు?’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ‘వీరిదంతా వాట్సాప్ యూనివర్సిటీ’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More »

ఎన్నికల బాండ్ల రద్దు తమకు ఎదురుదెబ్బ కాదన్న ప్రధాని మోదీ

ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి ఎదురుదెబ్బగా తాము భావించట్లేదని స్పష్టం చేశారు. ఏ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఉండదని ఆయన చెప్పారు. లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలేం జరిగిందని మేము దీన్ని ఎదురుదెబ్బగా భావించాలో చెప్పండి? ఎలక్బోరల్ బాండ్‌ల రద్దు చూసి సంబరపడుతూ చిందులేస్తున్న వారు భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు. అసలు ఈ రోజు నిధుల రాకడ గురించి ఇంత ...

Read More »

చంద్రబాబుపై బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదు

రోజుల తరబడి ఢిల్లీలో పార్టీ ఆఫీసు చుట్టూ తిరిగి చివరికి ప్రజల్లో బీజేపీని తక్కువ చేసి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. మైనార్టీల ఓట్ల కోసమే చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది పొత్తు ధర్మానికి విరుద్ధమని మండిపడ్డారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడినందుకు త్వరలో పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Read More »

పెండింగ్ సీట్లపై కూటమిలో కొనసాగుతున్న గందరగోళం..

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా కూటమిలో పెండింగ్ సీట్లపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీంతో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేనలో అనిశ్చితి నెలకొంది. దాదాపు 5 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ తమ అభ్యర్థుల ఇంకా ప్రకటించ లేదు. అదేవిధంగా ఒక ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ ...

Read More »

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై MP విజయసాయిరెడ్డి ఫైర్

టీడీపీ-జనసేన-బీజేపీల కూటమిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు జనసేన నేతలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కుల, మతతత్వ పార్టీలు అన్ని ఒక్కటయ్యాయని అన్నారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి భవిష్యత్ లేదని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదని.. ...

Read More »