టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ నేడు తెలంగాణ ముఖ్యమమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ను సీఎం అభినందించారు. ఆ తర్వాత సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎం రేవంత్ రెడ్డికి బహుకరించాడు. కాగా, ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హైదరాబాద్ పేసర్.. రిటర్న్ గిఫ్ట్గా సిరాజ్ ఏమిచ్చాడో తెలుసా?
