తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్కు వెళ్లారు. అనంతరం అక్కడ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పత్యేక రాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ‘తెలంగాణను ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నారు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెట్టాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదాన్ని ఇచ్చాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు తీర్చిదిద్దుతున్నామని అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.