టాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మ బిజీ బిజీ..

rasi-kanna-12-.jpg

టాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు కొంత మంది తెలుగు చిత్ర పరిశ్రమపై శీతకన్ను వేస్తున్నారు. సమంత, నిత్యా, రకుల్ ప్రీత్ టీటౌన్ ప్రేక్షకులను పలకరించి దాదాపు రెండేళ్లు అయిపోతుంది. పొరుగు పరిశ్రమలపై చూపిస్తూన్న ఇష్క్ టాలీవుడ్ పై కనిపించడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు టాప్ బ్యూటీస్. ఖుషి తర్వాత సమంత మా ఇంటి బంగారం ఎనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. తెలుగు ఆడియన్స్ తో దూరంగా ఉంటుంది కానీ నార్త్ బెల్ట్ ప్రేక్షకులతో ర్యాపో మెయిన్ టైన్ చేస్తోంది. సీటాడెల్ తర్వాత రక్త బ్రహ్మాండ్ సిరీస్ తో బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది సామ్. ఇప్పుడు సమంతనే ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తోంది రాశీ ఖన్నా.

నాగ చైతన్య థాంక్యూ తర్వాత మరో తెలుగు మూవీలో కనిపించలేదు రాశీ. ఈ రెండేళ్ల పాటు తిరు, సర్దార్, యోధ, ఆరణ్మనై 4, సబర్మతి రిపోర్ట్, అగత్యాతో బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్టులతో హాయ్ చెప్పింది అమ్మడు. ప్రెజెంట్ తెలుగులో సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదాలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాతో నీరజ కోన దర్శకురాలిగా ఇంట్రడ్యూస్ అవుతోంది. రాశీ చేతిలో ఉన్న ఏకైక సౌతిండియన్ ప్రాజెక్ట్ ఇది. మరో తెలుగు మూవీకి కమిటైన టాక్ లేదు. తెలుసు కదాతో పాటు హిందీలో ‘టైమ్’ చేస్తోంది రాశీ ఖన్నా. 12త్ ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్నాడు. సబర్మతి రిపోర్ట్ తర్వాత మరోసారి జోడీ కడుతున్నారు విక్రాంత్ అండ్ రాశీ. ఇదే కాకుండా రాజ్ అండ్ డీకే హిట్ సిరీస్ ఫర్జీలో సీక్వెల్లో కూడా నటించబోతుంది. రీసెంట్లీ ఈ విషయాన్ని లీక్ చేసింది అమ్మడు. ఫర్జీ 2 కోసం రాజ్ అండ్ డీకే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలా హిందీలో బిజీగా ఉంటూ  తెలుగులో అరకొర సినిమాలతో సరిపెట్టేస్తోంది.

Share this post

scroll to top