స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలి..

manyam-11.jpg

గిరిజన హక్కులు, చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్‌ అయ్యన్న­పాత్రు­డు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరింలంటూ చెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు మన్యం బంద్‌ చేపట్టాయి.  ఇవాళ ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. 1/70 యాక్ట్‌ను సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘాలు హెచ్చరించాయి.

టూరిజం ముసుగులో గిరిజన భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని  నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్‌ చేశాయి.  స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల అఖిల పక్షం  నేడు, రేపు మన్యం బంద్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ బంద్‌కు వైయ‌స్ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. 

Share this post

scroll to top