పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం బాబుకు ఇష్టం లేదు..

rajani-29.jpg

అర్ధిక అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు తన మనుషులకే మేలు చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. మహమ్మారి కరోనా సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారని, చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరుగారి పోయాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదలచుకున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, జనాలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు అని విడదల రజని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడారు.

పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని చంద్రబాబు నాయుడు ఏం చేయదలచుకున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బాబు ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. మేము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం వైఎస్ జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మరలా డోలీల బాధ తప్పటం లేదు’ అని విడదల రజని ఆవేదన వ్యక్తం చేశారు.

Share this post

scroll to top