బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు..

chevi-reddy-25.jpg

మాజీమంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందా అని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే జగన్ సిఎం అయినా తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు. బాలినేని కొత్త పార్టీ వాళ్ల మెప్పు పొందటానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని పేర్కొన్నారు. జగన్‌ను విమర్శిస్తే పార్టీలో మెచ్చుకుంటారు అని ఆయన దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదన్నారు. ఎమ్మెల్సీ కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అనుకుంటున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.

Share this post

scroll to top