ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఫీజు పోరు వాయిదా..

ysrcp-04.jpg

విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేసిన‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున, మా ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, మార్చి 12వ తేదీన ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించామ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

Share this post

scroll to top