వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్ చేరుకుంటారు, అక్కడ ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు, అనంతరం మధ్యాహ్నం 12.00 గంటలకు తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.
రేపు తెనాలిలో వైయస్ జగన్ పర్యటన..
