అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం అయింది. క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పాలు పోస్తున్న మహిళలే అమూల్కు యజమానులు అని.. ప్రైవేటు డైరీలు కన్నా.. ఎక్కవ రేటు ఇచ్చి అమూల్ పాలు కొనుగోలు చేస్తోందని వెల్లడించారు.
Read More »Tag Archives: cm jagan
సిటీజెన్ సర్వీసెస్ పోర్టల్ ను ప్రారంభించిన జగన్
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు రూపొందించిన నూతన సాఫ్ట్వేర్ పోర్టల్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. సిటీజెన్ సర్వీసెస్ పోర్టల్ 2.0 కాసేపట్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారు. ఒకే పోర్టల్ కిందకు వేర్వేరు శాఖల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే సచివాలయాల ద్వారా రెండేళ్లలో 3.47 కోట్ల సేవలు ప్రజలకు అందాయి. ఇంకాస్త వేగంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం నూతన సాఫ్ట్వేర్ పోర్టల్ను రూపొందించింది.
Read More »వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని ప్రారంభించిన సీఎం
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక భూములమీద లిటిగేషన్ లేని పరిస్థితి వస్తుందని, ఆ ప్రక్రియ చేయడం కోసమే ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే చేపట్టామని, తొలిదశలో 50 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. మంగళవారం నుంచి 37 గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేయిస్తామన్నారు. రాబోయే 3 వారాల్లో మిగతా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామన్నారు.
Read More »ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏపీకి తిరిగొచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇవాళ కూడా ఆయన బిజీగా గడిపారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర సమాచార ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లతో వరుసగా భేటీ అయ్యారు. సీఎం జగన్ నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలతో సమావేశం కావడం తెలిసిందే.
Read More »ఇంటర్నేషనల్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు భారీ నజరానా
ఇటీవల స్పెయిన్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించిన అంతర్జాతీయ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తిరుపతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమిని కేటాయించనున్నట్లు సిఎం వైఎస్ జగన్ వెల్లడించారు. అలాగే రజత పతకం సాధించినందుకు శ్రీకాంత్కు రూ.7 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. ఈ నగదు బహుమతిని క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్వయంగా అందజేశారు. రాష్ట్రంలో ...
Read More »అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘నేడు బాబా సాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాల మీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ ...
Read More »మరో 10 రోజుల్లో పిఆర్సి ప్రకటిస్తాం..
మరో 10 రోజుల్లో పిఆర్సిని ప్రకటిస్తామని ఎపి సిఎం జగన్ శుక్రవారం పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సిఎం తిరుపతిలో పర్యటిస్తున్నారు. పలు ఉద్యోగ సంఘాలు ఆయనను కలిసి.. తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన సిఎం.. పిఆర్సి ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజుల్లో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.
Read More »ఏపీ అసెంబ్లీలో కులగణన తీర్మానం
కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి వేణుగోపాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ 1931 తరువాత కులపరమైన జనాభా గణన జరగలేదని తెలిపారు. దేశంలో వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. కులగనణపై కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్కు తాము మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. దేశంలో బీసీల జనాభా 52 శాతంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ ...
Read More »ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీల: జగన్
ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్ విడ్త్తో ఇంటర్నెట్ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.
Read More »సచివాలయ ఉద్యోగులకు జగన్ గుడ్న్యూస్
విజయ దశమి రోజు సచివాలయం, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సెక్రటేరియట్, వివిధ శాఖలకు సంబంధించిన హెచ్వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్దరించారు.. ఉద్యోగుల ఉచిత వసతిని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ఏపీ సచివాలయ సంఘం.. సీఎం వైఎస్ జగన్ను కోరారు.. సచివాలయ సంఘం విజ్ఞప్తిని అంగీకరించిన సీఎం జగన్… వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతిని కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు ...
Read More »