సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన చాగంటి కోటేశ్వరరావు..

chagati-25-.jpg

ఈ మధ్యే నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ కేబినెట్‌ హోదా కల్పించింది సర్కార్‌ అయితే, ఈ రోజు తనను మర్యాదపూర్వకంగా కలిసిన చాగంటి కోటేశ్వరరావును సన్మానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును శాలువాతో సన్మానించిన సీఎం చంద్రబాబు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి. విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి అంటూ చాగంటి కోటేశ్వరరావుకు సూచించారు. ఇక, తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు చాగంటి కోటేశ్వరరావు..

Share this post

scroll to top