70 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఎలా పడితే అలా పిటిషన్ వేయడం సరికాదని హోంమంత్రి అనితకు హైకోర్టు తేల్చిచెప్పింది. ఫిర్యాదుదారునితో తనకు రాజీ కుదిరినందున కేసు ప్రొసీడింగ్స్ కొట్టేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజీలో ఏం కుదిరింది? సమస్యకు ఏం పరిష్కారం చూపారో చెప్పాలంది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.