నేడు జిల్లాల అధ్యక్షులతో వైయ‌స్‌ జగన్‌ భేటీ..

ys-jagan-29.jpg

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు తాడేపల్లిలో జిల్లా అధ్యక్షులతో వైఎస్‌ జగన్‌ సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులు, ముఖ్య నేతలు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించే సమావేశానికి హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Share this post

scroll to top