కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్.. 

kakani-26.jpg

 వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కోర్టు రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన ఆయన్ను పోలీసులు కోర్టు హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలు కు తరలించారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలించగా బెంగళూరు సమీపంలో ఒక పల్లెటూరిలోఉన్న రిసార్టులో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆదివారం సాయంత్రం ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరుకు తరలించారు.

Share this post

scroll to top