ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపై సర్వే..

ration-17.jpg

కొత్తరేషన్ కార్డులపై ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సర్వే చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఏపీ సర్కారు సర్వే చేయిస్తోంది. ఈ-కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. అనర్హులకు రేషన్ కార్డులు ఉండటంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సర్వే ఆధారంగా బోగస్ కార్డులను ఏరివేసే పనిలో ఉంది. అర్హులైన వారికి ఆంధ్రప్రదేశ్ సర్కారు రేషన్ కార్డులను జారీ చేయనుంది. రేషన్ కార్డులు ఉన్నవారికి బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి అతి తక్కువ ధరకే ఇస్తారు. ఏపీ సర్కారు గత నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు స్వీకరిస్తోంది.

Share this post

scroll to top